Chandrababu: ఆ విషయాన్ని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: చంద్రబాబు

  • ఏ జాతీయ ప్రాజెక్టు పనులైనా పోలవరం అంత వేగంగా జరుగుతున్నాయా?
  • నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
  • నదులను అనుసంధానం చేసిన ఏకైక రాష్ట్రం ఏపీనే

ఏ జాతీయ ప్రాజెక్టు పనులైనా పోలవరం ప్రాజెక్టు అంత వేగంగా జరుగుతున్నాయా? అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు 65 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. దేశంలో ఏ ప్రాజెక్టు పనులైనా ఇంతకన్నా వేగంగా జరుగుతున్నాయని నిరూపిస్తే... రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. నదులను అనుసంధానం చేస్తామని తిరుపతి సభలో ప్రధాని మోదీ చెప్పారని... ఆ తర్వాత దాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసిన ఏకైక రాష్ట్రం ఏపీనేనని చెప్పారు. కోర్టులకు వెళ్తూ పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టును వైసీపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. 

  • Loading...

More Telugu News