కల్వకుంట్ల కవిత చొరవ.. ఇరాక్ నుంచి సొంతగూటికి 14 మంది తెలంగాణ వాసులు!
- ఇరాక్ లో ఐదు నెలలుగా నరకం
- ఏజెంట్ల చేతిలో మోసపోయిన వైనం
- కవిత, టీఆర్ఎస్ నేతలకు బాధితుల కృతజ్ఞతలు
ఈ నేపథ్యంలో ఇరాక్ లో చిక్కుకున్న 14 మంది నిజామాబాద్ జిల్లా వాసులు విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి నుంచి రైలులో బయలుదేరి ఈ రోజు కాచిగూడ రైల్వే స్టేషన్ లో దిగారు. ఈ సందర్భంగా తమను కాపాడినందుకు కల్వకుంట్ల కవితతో పాటు టీఆర్ఎస్ నేతలు, అధికారులు, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏజెంట్లు మోసం చేయడంతో తాము ఇరాక్ లో చిక్కుకున్నామని పేర్కొన్నారు.