subhashini: శ్రీదేవి చనిపోయిందని తెలిసి తట్టుకోలేకపోయాను: సీనియర్ నటి సుభాషిణి

  • ఆ రోజున టీవీ చూసి షాక్ అయ్యాను
  • శ్రీదేవి లేదనే మాటను చెప్పలేను
  • ఎంతో ఆత్మీయంగా పలకరించేది  

చూడటానికి జయసుధకి చాలా దగ్గరి పోలికలతో కనిపించే సుభాషిణి, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తొలినాళ్లలో కథానాయికగా కనిపించిన ఆమె, ఆ తరువాత ముఖ్యమైన పాత్రలను చేస్తూ వచ్చారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీదేవితో తనకి గల సాన్నిహిత్యాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు.

"ఓ రోజు ఉదయాన్నే మా వారు నన్ను పిలిచి టీవీలో వస్తోన్న ఒక వార్తను చూపించారు. శ్రీదేవి చనిపోయిందనే విషయం తెలిసి తట్టుకోలేకపోయాను. శ్రీదేవి ఇకలేదు అనే మాటను ఎలా చెప్పాలో .. ఎలా నమ్మాలో కూడా నాకు తెలియడం లేదు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

"శ్రీదేవి పెద్ద స్టార్ అయిపోయింది .. బాలీవుడ్ కి కూడా వెళ్లిపోయింది. ఆ తరువాత నేను ఆమెను కలిసింది చాలా తక్కువ. అక్కయ్య వాళ్లు ఎక్కడ కలిసినా నా గురించి అడిగేదట. తాను చేరుకున్న స్థాయికి నాతో మాట్లాడవలసిన అవసరం వుండదు. కానీ ఎప్పుడు కనిపించినా నన్ను ఎంతో ప్రేమగా .. ఆత్మీయంగా పలకరించేది. తనని ఎప్పటికీ మరిచిపోలేను" అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. 

  • Loading...

More Telugu News