Chandrababu: తమ్ముళ్లూ.. రాజశేఖర్ రెడ్డి మీకు చేసిందేముంది?: చంద్రబాబు

  • బీసీలకు న్యాయం చేసింది టీడీపీ మాత్రమే
  • మిగులు బడ్జెట్ ఉన్నా వైయస్ కేవలం 3వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు
  • టీడీపీ అధికారంలో ఉంటేనే బీసీలకు న్యాయం జరుగుతుంది

బీసీలకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టీడీపీ అంటే బీసీ... బీసీ అంటే టీడీపీ అని చెప్పారు. రాజమండ్రిలో నిర్వహించిన జయహో బీసీ సభలో ఆయన మాట్లాడుతూ, బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది దివంగత ఎన్టీఆర్ అని తెలిపారు. బీసీలకు రాజశేఖర్ రెడ్డి ఏమి చేశారు తమ్ముళ్లూ? అంటూ ప్రశ్నించారు. బీసీలను వైయస్ అణగదొక్కారని ఆరోపించారు. మిగులు బడ్జెట్ ఉన్నా బీసీలకు కేవలం రూ. 3 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని దుయ్యబట్టారు. బీసీలకు ఆధునిక పనిముట్టు ఒకటైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు.

తెలంగాణలో బీసీలను ఓసీలుగా మార్చారని... దానికి వైసీపీ అధినేత జగన్ మద్దతు పలికారని చంద్రబాబు విమర్శించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లో చేరాలనుకుంటున్న జగన్... ముందు దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఛైర్మన్ గా సుధాకర్ యాదవ్ ను నియమిస్తే... వ్యతిరేకించారని, ఆయనపై బురదజల్లే కార్యక్రమం చేపట్టారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉంటేనే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. 

  • Loading...

More Telugu News