rajamouli: రాజమౌళి సినిమాకి సంబంధించిన హాట్ టాపిక్!

  • షూటింగు దశలో రాజమౌళి సినిమా
  • శాటిలైట్ హక్కుల కోసం పోటీ
  • 150 కోట్ల ఆఫర్ అంటూ టాక్  

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా ఓ మల్టీ స్టారర్ రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు వుండనున్నట్టుగా తెలుస్తోంది. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనుండటంతో, ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం ఛానల్స్ మధ్య గట్టిపోటీ ఏర్పడిందట.

జీ టెలివిజన్ నెట్ వర్క్ వారు తెలుగు .. తమిళ .. హిందీ శాటిలైట్ రైట్స్ కోసం 150 కోట్లు కోట్ చేసినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. నిర్మాత దానయ్య ఈ ఆఫర్ ను హోల్డ్ లో పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది. 'బాహుబలి' .. బాహుబలి 2' తరువాత, భాషతో సంబంధం లేకుండా రాజమౌళి సినిమాలపై క్రేజ్ పెరిగిపోయింది. ఈ కారణంగానే ఈ సినిమా శాటిలైట్ హక్కులకు ఈ స్థాయి రేటు పలుకుతోందని అంటున్నారు. 

  • Loading...

More Telugu News