Andhra Pradesh: పవన్ కల్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి కావాలంటూ ప్రత్యేక పూజలు!

  • కృష్ణా జిల్లాలోని ఆంజనేయ ఆలయంలో పూజలు
  • పాల్గొన్న జనసేన నేతలు, కార్యకర్తలు
  • పవన్ సీఎం కావడం ఖాయమన్న జనసైనికులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటూ కృష్ణా జిల్లాలోని పున్నమ తోట ఆంజేయ స్వామి ఆలయంలో ఆ పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, మీడియా ఇన్ చార్జి హరిప్రసాద్, జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జనసేనతోనే సాధ్యమని తేల్చిచెప్పారు..

  • Loading...

More Telugu News