mahesh: అబుదాబీ వెళ్లనున్న 'మహర్షి'

  • పొల్లాచ్చిలో 'మహర్షి' షూటింగ్
  • తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో
  • ఏప్రిల్ చివరివారంలో రిలీజ్      

ప్రస్తుతం మహేశ్ బాబు .. 'మహర్షి' సినిమా చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, కొన్ని రోజులుగా 'పొల్లాచ్చి'లో షూటింగ్ జరుపుకుంటోంది. మహేశ్ బాబు .. తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ వారం చివరివరకూ అక్కడే చిత్రీకరణ జరగనుంది. ఆ తరువాత షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు.

ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ ప్లాన్ చేశారు. ఆ తరువాత షెడ్యూల్ ను అబుదాబీలో చేయనున్నారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. మిగతా పనులన్నీ పూర్తి చేసుకుని, ఏప్రిల్ చివరివారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మహేశ్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తుండగా, మహేశ్ ప్రాణ స్నేహితుడిగా కీలకమైన పాత్రలో అల్లరి నరేశ్ కనిపించనున్నాడు.

  • Loading...

More Telugu News