YSRCP: జగన్ పై దాడి కేసు: వైసీపీ నేతలను విచారిస్తున్న ఎన్ఐఏ

  • విశాఖపట్టణంలోని సీతమ్మధారలో అధికారుల విచారణ
  • మాజీ ఎమ్మెల్యే విజయప్రసాద్ ను ప్రశ్నించిన ఎన్ఐఏ
  • విజయప్రసాద్ నివాసంలోనే మిగిలిన నేతల విచారణ

వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ కొనసాగుతోంది. విశాఖపట్టణంలోని సీతమ్మధారలో మాజీ ఎమ్మెల్యే విజయప్రసాద్ ను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. విజయ్ ప్రసాద్ నివాసంలోనే మిగతా వైసీపీ నేతలనూ విచారణ జరుపుతున్నారు. వైసీపీ నేతలు కరణం ధర్మశ్రీ, శ్రీధర్, నాగిరెడ్డి, రాజన్న దొర, విజయ్ కుమార్, శ్రీనులను ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News