Congress: కాంగ్రెస్ నలుగురు గాంధీలనిస్తే.. బీజేపీ ముగ్గురు మోదీలనిచ్చింది: బీఎస్పీ నేత విజయ్ యాదవ్

  • కాంగ్రెస్-బీజేపీపై బీఎస్పీ మూకుమ్మడి దాడి
  • బీజేపీకి ఇక నిద్రలేని రాత్రులేనన్న బీఎస్పీ నేత
  • బీజేపీ తోక ముడవక తప్పదు

కాంగ్రెస్ ఈ దేశానికి నలుగురు గాంధీలను ఇస్తే.. బీజేపీ ముగ్గురు మోదీలను ఇచ్చిందని బహుజన్ సమాజ్ పార్టీ నేత విజయ్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విజయ్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు.

 దేశంలోనే అత్యంత అవినీతి పార్టీ అయిన కాంగ్రెస్ ఈ దేశానికి ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్ గాంధీలను ఇస్తే.. బీజేపీ నరేంద్రమోదీ, లలిత్ మోదీ, నీరవ్ మోదీలను ఇచ్చిందన్నారు. బీజేపీకి ఇక నిద్రలేని రాత్రులేనన్న విజయ్ యాదవ్.. బీజేపీ నేతలను తరిమి కొడదామని పిలుపునిచ్చారు. ఎస్పీ-బీఎస్పీ కూటమి దెబ్బకు బీజేపీ తోకముడవక తప్పదన్నారు.  

  • Loading...

More Telugu News