ఆడపడుచులను రోడ్డుపైకి లాగారంటూ చిరంజీవి కంటతడిపెట్టారు.. అందుకు నేనే సాక్ష్యం!: పోసాని
- లక్ష్మీపార్వతిని చంద్రబాబు అన్ పాప్యులర్ చేశారు
- చిరంజీవి ఇంట్లోని ఆడపడుచుల గురించి టీడీపీ నేతలు దారుణంగా మాట్లాడారు
- టీడీపీ నేతలు ఎంతటి దారుణాలకైనా ఒడిగడతారు
ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారని... ఆ సమయంలో చిరంజీవి ఇంట్లో ఆడపడుచుల గురించి టీడీపీ నేతలు ఎంత దారుణంగా మాట్లాడారో వీడియో క్లిప్పింగుల్లో చూడవచ్చని అన్నారు. ఇప్పుడు మళ్లీ అదే పరంపరను కొనసాగిస్తున్నారని షర్మిళ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ చెప్పారు. రాజకీయాల్లోకి వస్తే, కుటుంబంలోని ఆడపడుచులను రోడ్డుపైకి లాగారంటూ చిరంజీవి చాలాసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారని... దానికి తానే సాక్ష్యమని చెప్పారు. గెలవడం కోసం కొందరు టీడీపీ నేతలు ఎంతటి దారుణాలకైనా ఒడిగడతారని అన్నారు.