Andhra Pradesh: షర్మిల నా కూతురు లాంటిది.. కులాలను రెచ్చగొట్టడంతోనే అప్పుడు అలా మాట్లాడా!: జేసీ దివాకర్ రెడ్డి

  • కులాంతర వివాహం చేసుకున్న షర్మిలను అభినందించా
  • ఆమెను తిట్టిఉంటే నాకు పాపం తగులుతుంది
  • మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత

వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల తనకు కుమార్తెతో సమానమని అనంతపురం పార్లమెంటు సభ్యుడు, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. కులాంతర వివాహం చేసుకున్నందుకు షర్మిలను తాను గతంలోనే అభినందించానని గుర్తుచేశారు. షర్మిలను విమర్శించి ఉంటే తనకు పాపం తగులుతుందని వ్యాఖ్యానించారు. వైఎస్ కుటుంబం కులాలను రెచ్చగొట్టడంపైనే తాను గతంలో స్పందించాననీ, ఆ సందర్భంగానే విమర్శలు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.

అనంతపురం జిల్లాలో ఇటీవల జరిగిన ధర్మపోరాట దీక్షలో మాట్లాడుతూ.. నీ సోదరి షర్మిల ఓ బ్రాహ్మణుడిని పెళ్లి చేసుకోలేదా? అని జేసీ జగన్ ను అప్పట్లో ప్రశ్నించారు. జగన్ కులం ఆధారంగా ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. ప్రజల ఆదరణ ఉంటేనే సీఎం అవుతారు తప్ప కులంతో కాదని హితవు పలికారు. జగన్ కు కులపిచ్చి ఎక్కువని దుయ్యబట్టారు. జగన్ లాగే కుల రాజకీయాలు చేస్తున్న పవన్ కూడా ఓటమి చవిచూస్తారని జోస్యం చెప్పారు. తాజాగా ఈ వ్యవహారంపైనే జేసీ వివరణ ఇచ్చారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
Jagan
jc
diwakar reddy
Sharmila
daughter
  • Loading...

More Telugu News