Andhra Pradesh: కడప జిల్లాలో టీడీపీకి షాక్.. వైసీపీలో చేరనున్న ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి!

  • టీడీపీలో ప్రాధాన్యత దక్కకపోవడంపై అసంతృప్తి
  • రాజంపేట నేతలతో కొంతకాలంగా చర్చలు
  • త్వరలోనే విజయసాయిరెడ్డితో భేటీ

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కడప జిల్లాలో అధికార టీడీపీకి షాక్ తగలనుంది. టీడీపీ నేత, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి త్వరలోనే వైసీపీలో చేరబోతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రాజంపేట వైసీపీ నేతలతో ఈ విషయమై మాట్లాడిన మల్లికార్జున రెడ్డి, విజయసాయిరెడ్డితో ఓసారి చర్చించాక వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

టీడీపీలో తగిన ప్రాధాన్యం దక్కకపోవడంతోనే మేడా మల్లికార్జునరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఆయన సరిగ్గా ఎన్నికలకు ముందుగా వైసీపీలో చేరబోతున్నారు. కాగా, మల్లికార్జున రెడ్డికి వైసీపీలో ఏ బాధ్యత అప్పగిస్తారన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

  • Loading...

More Telugu News