allu sirish: 'ఏబీసీడీ'పైనే అల్లు శిరీశ్ ఆశలు

  • మలయాళంలో హిట్ కొట్టిన 'ఏబీసీడీ'
  • తెలుగులో రీమేక్ చేస్తోన్న సంజీవ్ రెడ్డి
  • మార్చి 1వ తేదీన విడుదల      

అల్లు శిరీశ్ కథానాయకుడిగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో 'ఏబీసీడీ' సినిమా రూపొందింది. మధుర శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాను మార్చి 1వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ చేసిన 'ఏబీసీడీ' సినిమాకి ఇది రీమేక్. మలయాళ సినిమా మంచి వసూళ్లను సాధించి విజయాన్ని అందుకుంది. దుల్కర్ కెరియర్ కి ఈ సినిమా ఎంతో హెల్ప్ అయింది కూడా. అందువలన అదే టైటిల్ తో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో అల్లు శిరీశ్ వున్నాడు. ఆయన ఆశించిన సక్సెస్ ఈ సినిమాతో దొరుకుతుందేమో చూడాలి. ఈ సినిమాలో శిరీశ్ జోడీగా రుక్సార్ థిల్లాన్ కనిపించనుంది. ఆమె కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ ఇద్దరికీ ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి మరి. 

  • Loading...

More Telugu News