Andhra Pradesh: సొంత నియోజకవర్గంలో జగన్ టూర్.. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు!

  • సీఎస్ఐ చర్చిని దర్శించుకోనున్న జగన్
  • అనంతరం ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు
  • 14 నెలల తర్వాత కడపలో అడుగుపెట్టిన నేత

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ దాదాపు 14 నెలల తర్వాత సొంత జిల్లా కడపకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడి సీఎస్ఐ చర్చిలో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇడుపులపాయలోని వైఎస్సాఆర్ ఘాట్ లో దిగవంత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించనున్నారు.

  • Loading...

More Telugu News