Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో చింత చెట్టును ఢీకొట్టిన పోలీస్ కారు.. ఐదుగురి పరిస్థితి విషమం!

  • చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఘటన
  • వేగంగా వెళుతూ అదుపు తప్పిన వాహనం
  • ఆరోగ్యం విషమంగానే ఉందంటున్న వైద్యులు

ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలంలో పోలీసులు వెళుతున్న ఓ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడ్డ ఐదుగురు సిబ్బంది ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News