Prabhas: మహేశ్ మాల్ ను మించిన మాల్ నిర్మాణంలో ప్రభాస్!

  • భారీ మల్టీ ప్లెక్స్ నిర్మించిన మహేశ్ 
  • అదే బాటలో పెద్ద నిర్మాతలు 
  • ఆల్రెడీ రంగంలోకి దిగిన ప్రభాస్    

హైదరాబాద్ లో మహేశ్ బాబు నిర్మించిన ఏఎంబీ మాల్ ను గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. అత్యంత విలాసవంతమైన ఈ థియేటర్ లో సినిమాలు చూసిన ప్రేక్షకులు, ఆ అనుభూతి అద్భుతం అని చెబుతున్నారు. ఇక ఈ తరహా మల్టీ ప్లెక్స్ ల నిర్మాణం చేసే ఆలోచనలో సురేశ్ బాబు .. అల్లు అరవింద్ .. దిల్ రాజు వంటి చాలామంది నిర్మాతలు వున్నారు.

ఇక ప్రభాస్ కూడా మల్టీ ప్లెక్స్ ల నిర్మాణంపైనే దృష్టిపెట్టి ఆ దిశగా పనులను వేగవంతం చేశాడట. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో, చెన్నై .. కోల్ కత జాతీయ రహదారి పక్కన 'పిండిపాళెం' దగ్గర ఆయన ఈ మాల్ ను నిర్మిస్తున్నాడు. ఒక్కో థియేటర్లో 170 సిట్టింగ్ సామర్థ్యంతో .. మొత్తం 670 సీట్ల సిట్టింగ్ కలిగిన స్క్రీన్లతో ఈ మాల్ ఉంటుందని అంటున్నారు. ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో .. 106 అడుగుల వెడల్పు తెరతో ఈ మల్టీ ప్లెక్స్ నిర్మితమవుతోందట. ఆసియాలో ఇంతపెద్ద తెర కలిగిన మల్టీ ప్లెక్స్ లలో ఇది రెండవదట. మొత్తానికి ప్రభాస్ గట్టి మల్టీ ప్లెక్స్ కడుతున్నాడు. 

  • Loading...

More Telugu News