‘నంద్యాల’ పార్లమెంటు స్థానంపై టీడీపీలో పంచాయితీ.. సీటు తనదేనన్న ఎస్పీవై రెడ్డి!
- సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని వెల్లడి
- గతంలో ఎస్పీవై రెడ్డికి అసెంబ్లీ సీటు ఇస్తామన్న లోకేశ్
- అల్లుడికి నంద్యాల అసెంబ్లీ కోరుతున్న ఎస్పీవై రెడ్డి
కాగా, నంద్యాల అసెంబ్లీ సీటును తన అల్లుడికి ఇవ్వాలని ఎస్పీవై రెడ్డి చంద్రబాబును కోరినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. గతంలో ఎస్పీవై రెడ్డికి నంద్యాల అసెంబ్లీ సీటును, బుట్టా రేణుకకు పార్లమెంటు స్థానం ఇస్తామని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో కర్నూలుకు చెందిన టీడీపీ నేత టీజీ వెంకటేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎస్పీవై రెడ్డి లోకేశ్ ను హిప్నటైజ్ చేసుంటారనీ, అందుకే ఆయన అలాంటి ప్రకటన చేశారని వెంకటేశ్ అప్పట్లో వ్యాఖ్యానించారు.