Telugudesam: వామపక్షాలతోనే పొత్తు.. మరెవరితోనూ వుండదు!: జనసేన స్పష్టీకరణ

  • మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తాం
  • యువత, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత
  • అధికార, ప్రతిపక్ష పార్టీల మాటలను నమ్మవద్దు

రానున్న ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన పార్టీ అధికారికంగా స్పష్టం చేసింది. వామపక్ష పార్టీలతో తప్ప మరే ఇతర పార్టీతో కలసి వెళ్లమని తెలిపింది. ఈ మేరకు తమ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఎన్నికలలో యువత, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. పొత్తులపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మాటలను నమ్మవద్దని పార్టీ శ్రేణులకు సూచించింది. ఈ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించాలని కోరింది.

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, తమతో కలసి జనసేన పోటీ చేస్తే జగన్ కు నొప్పేంటి? అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. టీడీపీతో, జనసేన చేతులు కలపబోతోందా? అనే అనుమానాలు కూడా పలువురిలో కలిగాయి. ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ... జనసేన తమ భవిష్యత్ కార్యాచరణ గురించి నేడు క్లారిటీ ఇచ్చింది.

  • Loading...

More Telugu News