High Court: తొలిరోజే కీలక కేసుల విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు

  • విజయవాడ కేంద్రంగా ప్రారంభమైన హైకోర్టు కార్యకలాపాలు 
  • ఉదయం 10 గంటలకే విధులకు హాజరైన చీఫ్‌ జస్టిస్‌
  • తొట్టతొలుత గ్రేటర్‌ విశాఖ మున్సిపాలిటీ కేసు విచారణ

విజయవాడ కేంద్రంగా ఏపీ హైకోర్టు వ్యవహారాలు బుధవారం ప్రారంభమయ్యాయి. విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న గవర్నర్‌ పేటలో కోర్టు వ్యవహారాల కోసం తాత్కాలిక భవనం కేటాయించడంతో ఉదయం నుంచి న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులతో ఆ ప్రాంతం రద్దీగా మారింది.

ఇక తొలి రోజే కీలక కేసుల విచారణను కోర్టు చేపట్టనుంది. హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన చీఫ్‌ జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ సహా మిగిలిన న్యాయమూర్తులు ఉదయం 10 గంటలకే విధులకు హాజరయ్యారు. తొలిరోజు మొత్తం 42 కేసుల విచారణ జరిగే అవకాశం ఉంది. మహా విశాఖ నగరపాలక సంస్థ వేసిన రిట్‌ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌గా ప్రవీణ్‌కుమార్‌ తొలికేసుగా విచారించనున్నారు.

  • Loading...

More Telugu News