kalva: బులంద్‌షహర్‌ ఘర్షణలలో ఇన్‌స్పెక్టర్‌పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్!

  • ఆవుల వధింపుపై నిరసనలు
  • సుబోధ్‌ను గొడ్డలితో నరికిన కల్వా
  • కాల్పులతో హత్య చేసిన ప్రశాంత్

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఆవులను అక్రమంగా వధించారంటూ డిసెంబర్ 3న నిరసనలు తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన గొడవలో ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌కుమార్ ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా బజరంగ్‌దళ్ జిల్లా కన్వీనర్ యోగేశ్‌రాజ్‌ను పేర్కొన్న పోలీసులు.. అనంతరం కల్వా అనే వ్యక్తిని అసలు నిందితుడిగా పేర్కొన్నారు. నేడు పోలీసులు కల్వాను అదుపులోకి తీసుకున్నారు.

అల్లర్ల సమయంలో సుబోధ్‌పై కల్వా గొడ్డలితో దాడి చేశాడు. ఆ తర్వాత ఆయన చేతి వేళ్లను నరికేందుకు యత్నించాడు. ఆ తర్వాత ప్రశాంత్ నట్ అనే వ్యక్తి సుబోధ్‌పై కాల్పులు జరిపి హత్య చేసినట్టు తేలింది. ప్రశాంత్‌ను డిసెంబర్ 28నే అదుపులోకి తీసుకున్నారు. సుబోధ్‌పై దాడి చేసేందుకు ఉపయోగించిన గొడ్డలిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

kalva
Prashanth Nutt
Subodh kumar
Uttar Pradesh
Bulandshahar
  • Loading...

More Telugu News