yash: 150 కోట్ల క్లబ్ లోకి దూసుకుపోయిన 'కేజీఎఫ్'

  • 80 కోట్లతో రూపొందిన 'కేజీఎఫ్'
  • వాస్తవానికి దగ్గరగా నడిచిన కథాకథనాలు 
  • హిందీ వెర్షన్ వసూళ్లు 26 కోట్లకు పైగా

కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా .. దర్శకుడు ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్'ను తెరకెక్కించాడు. 80 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. క్రితం నెల 21వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కన్నడలోను .. హిందీలోను ఈ సినిమా ఒక రేంజ్ లో వసూళ్లను రాబడుతోంది. బంగారు గనుల మాఫియా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, ఇంతవరకూ హిందీ వెర్షన్ ద్వారా 26 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది.

11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 150 కోట్లను రాబట్టింది. ఈ సినిమాతో యశ్ రేంజ్ పూర్తిగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ వాస్తవానికి దగ్గరగా ఈ కథను ఆవిష్కరించడం .. ప్రతి పాత్రను సహజత్వంతో మలిచిన తీరు .. యశ్ నటన ఈ సినిమాకి ఈ స్థాయి క్రేజ్ ను తెచ్చిపెట్టాయని అంటున్నారు. శ్రీనిధి శెట్టి కెరియర్ కి ఈ సినిమా ఎంతో హెల్ప్ అవుతుందని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News