Prakash Raj: కొత్త సంవత్సరంలో ఎన్నికల గోదాలోకి... కీలక ప్రకటన చేసిన నటుడు ప్రకాశ్ రాజ్!

  • ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను
  • ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతా
  • ట్విట్టర్ లో వెల్లడించిన ప్రకాశ్ రాజ్

నూతన సంవత్సర శుభవేళ, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కీలక ప్రకటన వెలువరించారు. ఈ సంవత్సరం జరిగే లోక్ సభ ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడనున్నానని ఆయన తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెడుతూ, ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్న వివరాలను త్వరలో తెలియజేస్తానని అన్నారు.

"అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరి మద్దతుతో లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను" అని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా, రజనీకాంత్, కమలహాసన్ తర్వాత రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన సినీ ప్రముఖుల్లో ప్రకాష్‌రాజ్ మూడో వ్యక్తి.

  • Loading...

More Telugu News