Narasimhan: వేగంగా హైకోర్టుల ఏర్పాటు పనులు.. ఉన్నతాధికారులతో గవర్నర్ నరసింహన్ సమావేశం

  • హైకోర్టు ఏర్పాటుకు శరవేగంగా సన్నాహాలు
  • తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాధాకృష్ణన్
  • ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రవీణ్‌కుమార్

తెలుగు రాష్ట్రాల హైకోర్టుల ఏర్పాటుకు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జనవరి 1 నుంచి ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేడు ఇరు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హైకోర్టుల ఏర్పాటు పనులు ఎంత వరకూ వచ్చాయి? తదితర అంశాలను చర్చించారు.

 జనవరి 1న ఉదయం 8:30 గంటలకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్‌, 10.30కి విజయవాడలో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్ ప్రమాణస్వీకారం చేస్తారు. తెలంగాణలో ప్రమాణ స్వీకారం అయిన వెంటనే గవర్నర్ ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లనున్నారు.

Narasimhan
Praveen kumar
Radhakrishnan
Telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News