Telangana: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్

  • ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ టీబీ రాధాకృష్ణన్
  • టీ- హైకోర్టు సీజేగా ఆయన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు
  • టీ- హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తుల కేటాయింపు

ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ తెలంగాణ హైకోర్టు సీజేగా కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. అదే విధంగా, జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ లను తెలంగాణ హైకోర్టుకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో, తెలంగాణ హైకోర్టుకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్య 13 కు చేరింది.

 

  • Loading...

More Telugu News