'రాష్ట్రపతి అంగరక్షకుల ఉద్యోగాలు ఆ మూడు కులాల వారికేనా?' అంటూ ఢిల్లీ హైకోర్టులో పిల్.. నోటీసులు జారీ చేసిన ధర్మాసనం!
- నేను యాదవ కులానికి చెందిన వాడిని
- ఆ పోస్టుకు తగ్గ అర్హతలన్నీ ఉన్నాయి
- మూడు సామాజిక వర్గాలకే ప్రాధాన్యం
ఈ సందర్భంగా ఈయన తరఫు న్యాయవాది రామ్ నరేశ్ మాట్లాడుతూ... రాష్ట్రపతి అంగరక్షకుడి పదవికి అర్హతలున్నవారిని పక్కనబెట్టి కేవలం మూడు సామాజిక వర్గాల వారికే ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. ఈ పిటిషన్ను పరిశీలించిన జస్టిస్ మురళీధర్, సంజీవ్ నారూలాతో కూడిన ధర్మాసనం.. పిటీషన్పై రక్షణ మంత్రిత్వశాఖ, ఆర్మీ నియామక బోర్డు డైరెక్టర్ లు నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేసింది. ఇతరత్రా ఏమైనా వివరణలు ఇవ్వదలిస్తే వచ్చే ఏడాది మే 8 వరకూ హైకోర్టు గడువిచ్చింది.