కుట్రలను ఛేదించడంలో చంద్రబాబు మగాడు.. మొనగాడు!: టీడీపీ ఎంపీ జేసీ
- తాను ఎల్లకాలం పీఎంగా ఉండేందుకు మోదీ ప్లాన్
- రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసేందుకు కుట్ర
- దేశం యావత్తూ బీజేపీని తిరస్కరిస్తోంది
ఈ రోజు రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసేందుకు కుట్ర జరుగుతోందని అంటూ ఆయన కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ ఎల్లకాలం పీఎంగా ఉండేందుకు కుట్ర జరుగుతోందని, ఆ కుట్రను భగ్నం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని, కుట్రలను ఛేదించడంలో బాబు మొనగాడు, మగాడని ప్రశంసించారు. దేశం యావత్తూ ఇప్పుడు బీజేపీని తిరస్కరిస్తోందని అన్నారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని ప్రశంసించారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న కోరిక చంద్రబాబుకు ఉందని, దాని కోసం ఆయన తన కుటుంబాన్ని, స్నేహితులను, అందరినీ మరిచిపోయి ఆ కార్యక్రమంలో ఉన్నారని అన్నారు.