Andhra Pradesh: పెథాయ్ తుపానుతో నాశనమైన పంట.. తట్టుకోలేక ఆగిన రైతన్న గుండె!

  • గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో ఘటన
  • కౌలు భూమిలో పంట వేసిన సుబ్బయ్య
  • పెథాయ్ తో తుడిచిపెట్టుకుపోయిన పంట

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ను తాకిన పెథాయ్ తుపాను రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పంట కోతకొచ్చిన సమయంలో తుపాను తీరాన్ని తాకడంతో రైతన్నల పంటలన్నీ దెబ్బతిన్నాయి. తాజాగా అప్పు చేసి మరీ పంట వేసిన ఓ రైతు చివరికి తన కష్టమంతా తుపాను పాలు కావడంతో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని చేబ్రోలు మండలం గొల్లపాలెంకు చెందిన ఆలపాటి సుబ్బయ్య (65) ఓ రైతు. దాదాపు 12 ఎకరాలను ఆయన కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. అయితే ఇటీవల వచ్చిన పెథాయ్ దెబ్బకు పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో చేసిన అప్పులు తీర్చేది ఎలా? అని సుబ్బయ్య మనస్తాపానికి లోనయ్యాడు.

ఈ క్రమంలో ఒక్కసారిగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆయన అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, సుబ్బయ్య కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని అధికారులు తెలిపారు.

Andhra Pradesh
Guntur District
pethai
storm
farmar
heart attack
  • Loading...

More Telugu News