prabhas: 2020 సంక్రాంతికి ప్రభాస్ రొమాంటిక్ లవ్ స్టోరీ

  • 'సాహో' షూటింగులో బిజీగా ప్రభాస్ 
  • ఆగస్టు 15న విడుదల చేసే ఛాన్స్
  • రాధాకృష్ణ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి      

ప్రభాస్ కథానాయకుడిగా .. యాక్షన్ ఎంటర్టైనర్ గా 'సాహో' రూపొందుతోంది. సుజిత్ దర్శకత్వంలో నిర్మితమవుతోన్న ఈ సినిమా ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసుకుంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలోని రొమాంటిక్ లవ్ స్టోరీని కూడా ప్రభాస్ పట్టాలెక్కించాడు.

ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇటలీలో జరిగిన ఈ షెడ్యూల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాను 2020 సంక్రాంతికి విడుదల చేయాలనే నిర్ణయం జరిగిపోయిందనేది తాజా సమాచారం. ప్రేక్షకులు ప్రభాస్ ను రొమాంటిక్ లవ్ స్టోరీలో చూసి చాలాకాలమే అయింది. వాళ్ల ముచ్చట 2020 సంక్రాంతికే తీరనుందన్న మాట.

  • Loading...

More Telugu News