వందమంది ఒవైసీలు వచ్చినా మాకు చంద్రబాబు ఒక్కరు చాలు: అసద్కు కౌంటర్ ఇచ్చిన జలీల్ ఖాన్
- అసదుద్దీన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన జలీల్ ఖాన్
- ఎంఐఎం హైదరాబాద్కే పరిమితం
- ‘జయహో బీసీ’పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
ఏపీలో మళ్లీ తలెత్తుకుని తిరగాలంటే టీడీపీ తిరిగి అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. ఇన్నాళ్లు వ్యాపారాలు, కాలక్షేపం చేసింది చాలని, ఇకపై ఎన్నికల కోసమే పనిచేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 30న రాజమండ్రిలో ‘జయహో బీసీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను విజయవాడ పాతబస్తీలోని మాడపాటి క్లబ్లో జలీల్ ఖాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.