amaravathi: ఏపీలో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు ఎవరైనా ముందుకు రావచ్చు: మంత్రి లోకేశ్
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-ddd15e09c0de3693fb206b2b1a46a4c64739054a.jpg)
- కనీసం 250 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలి
- పరిశ్రమ ఏర్పాటుకు ఏడాది తర్వాత భూములిస్తాం
- ఆరు ఐటీ కంపెనీలను ప్రారంభించడం సంతోషంగా ఉంది
ఏపీలో ఐటీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఎవరైనా ముందుకొచ్చి, కనీసం 250 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తే వారికి ఏడాది తర్వాత భూములిస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఇన్ఫో సైట్ భవనంలో 6 ఐటీ కంపెనీలను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, ఆరు ఐటీ కంపెనీలను ప్రారంభించడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-b3041a59f80e98abdab26bdddc2556230238cc09.jpg)