లగడపాటి మోసం చేశారని టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు!
- అసెంబ్లీ ఎన్నికలకు ముందు లగడపాటి సర్వే
- ఓటర్లను ప్రలోభ పెట్టారంటున్న టీఆర్ఎస్ నేత
- రజత్ కుమార్ కు ఫిర్యాదు చేసిన వెంకట రమణారెడ్డి
ఆయన చేసిన ప్రకటనలు ఓటర్లను ప్రలోభపెట్టేలా, మభ్యపెట్టేలా ఉండటంతో ఇతర అభ్యర్థులపై ప్రభావం పడిందని తానిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజలను గందరగోళ పరిచేందుకు, తాననుకున్న వారికి ఓటేసేలా బ్లాక్ మెయిల్ చేసేందుకు లగడపాటి ప్రయత్నించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన చెప్పిన సర్వేలు పూర్తిగా అవాస్తవమని తేలిందని, ఓట్ల లెక్కింపు తరువాత, ఆయన ప్రకటించిన వారిలో ఎవరూ గెలవలేదని వెంకటరమణారెడ్డి గుర్తు చేశారు.