Pidamarthi Ravi: ఓడినా నేనే ఎమ్మేల్యే.. ఎవ్వరికీ ఏ పనులు కావు.. అందరికీ నట్లు బిగిస్తా: పిడమర్తి రవి సంచలన వ్యాఖ్యలు

  • పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న టీఆర్ఎస్
  • కేవలం ఒక్క స్థానాన్నే కైవసం చేసుకుంది
  • సత్తుపల్లి నుంచి పోటీ చేసిన పిడమర్తి రవి

ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పట్టు సాధించలేకపోయింది. మొత్తం 10 స్థానాల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ కేవలం ఖమ్మం నియోజకవర్గ స్థానాన్ని మాత్రమే చేజిక్కించుకోగలిగింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సత్తుపల్లిలో ఓడినా తానే ఎమ్మెల్యేనని... ఇక నుంచి ఎవరికీ ఏ పనులు కావని, అందరికీ నట్లు బిగిస్తానని హెచ్చరించారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా తన ద్వారానే సాధ్యమవుతుందని పిడమర్తి రవి స్పష్టం చేశారు. మరి ఈ వ్యాఖ్యలపై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి

  • Loading...

More Telugu News