'బ్రాహ్మణ' వివాదంలో ట్విట్టర్ సీఈఓను అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు!
- బ్రాహ్మణులను కించపరిచారంటూ దాఖలైన కేసు
- తీవ్ర వివాదాన్ని రేపిన ప్లకార్డు
- ప్రతినిధి సమక్షంలో విచారించేందుకు కోర్టు అంగీకారం
ఇండియాకు వెళ్లి ప్రజల మధ్య వైరాలు పెట్టి వచ్చారని డోర్సీపై విమర్శలు వెల్లువెత్తగా, ఆయన స్వయంగా క్షమాపణలు కూడా చెప్పారు. తన కార్యక్రమానికి వచ్చిన ఓ దళిత కార్యకర్త తనకు ఆ ప్లకార్డును ఇచ్చారని వివరణ ఇచ్చారు. ఆపై ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా, అమెరికా పౌరుడైన అతన్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచాల్సిన అవసరం లేదని, తమ ఆదేశాలు తదుపరి ఉత్తర్వుల వరకూ అమలులో ఉంటాయని, ఈ కేసును అతని న్యాయవాది లేదా ప్రతినిధి సమక్షంలో విచారించ వచ్చని కోర్టు తీర్పిచ్చింది. ఈ కేసులో జాక్ డోర్సీ తరఫున న్యాయవాది ముక్తేష్ మహేశ్వరి హాజరయ్యారు.