Telangana: తెలంగాణలో తొలి విజయం రికార్డు.. చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఒవైసీ ఘనవిజయం!

  • ఐదు స్థానాల్లో లీడ్ లో మజ్లిస్
  • అంబర్ పేటలో కిషన్ రెడ్డి ముందంజ
  • గోషామహల్, యాకుత్ పురాలో బీజేపీ

తెలంగాణ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడయింది. చాంద్రాయణగుట్ట మాజీ ఎమ్మెల్యే, ఆల్ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) శాసనపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ 51,400 మెజారిటీతో సమీప ప్రత్యర్థిపై ఘనవిజయం సాధించారు. మరోవైపు పాతబస్తీలోని 5 నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు. అక్బరుద్దీన్ మెజారిటీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గోషా మహల్, యాకుత్ పురాలో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు.

  • Loading...

More Telugu News