bellamkonda: నిజానికి 'కవచం' కల్యాణ్ రామ్ చేయవలసిందట!

  • మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 'కవచం'
  • పోలీస్ ఆఫీసర్ గా బెల్లంకొండ శ్రీనివాస్
  • ఆసక్తి చూపని కల్యాణ్ రామ్    

బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రంగా 'కవచం' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ .. మెహ్రీన్ కథానాయికలుగా నటించారు. తన మార్క్ మాస్ యాక్షన్ .. కాజల్ - మెహ్రీన్ గ్లామర్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని బెల్లంకొండ శ్రీనివాస్ భావించాడు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందని ఆశించాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందకపోవడం ఆయనను నిరాశపరిచిందని అంటున్నారు.అసలు ఈ సినిమాలో హీరోగా నందమూరి కల్యాణ్ రామ్ చేయవలసిందట. శ్రీనివాస్ మామిళ్ల చెప్పిన కథ విన్న తరువాత కల్యాణ్ రామ్ పెద్దగా ఆసక్తిని చూపలేదని సమాచారం. ఈ కారణంగానే కథ బెల్లంకొండ దగ్గరికి వచ్చిందని తెలుస్తోంది. ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్ గా చేసినందువలన కల్యాణ్ రామ్ అంగీకరించలేదనీ .. పోలీస్ ఆఫీసర్ గా ఇదే ఫస్టు మూవీ కనుక బెల్లంకొండ శ్రీనివాస్ అంగీకరించాడని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.   

More Telugu News