khushboo: 'బాహుబలి'ని చూడగానే రమ్యకృష్ణకి ఫోన్ చేసి తిట్టేశాను: ఖుష్బూ

  • రమ్యకృష్ణ నాకు మంచి స్నేహితురాలు
  • ఆ సీన్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి  
  • అవార్డు రాకపోవడం బాధ అనిపించింది  

రమ్యకృష్ణ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో 'బాహుబలి' మొదటిస్థానంలో కనిపిస్తుంది. ఆ సినిమా గురించి 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' తాజా ఇంటర్వ్యూలో సీనియర్ కథానాయిక ఖుష్బూ మాట్లాడారు. "రమ్యకృష్ణ చాలా బ్రిలియంట్ ఆర్టిస్ట్ .. మేమిద్దరం మంచి స్నేహితులం. ఆమె చేసిన 'బాహుబలి' చూడగానే నాకు చాలా జెలసీగా అనిపించింది. దాంతో వెంటనే ఫోన్ చేసి తిట్టేశాను.

అద్భుతమైన ఆమె నటన చూసి తనకి చాలా జెలసీగా అనిపిస్తోందని కూడా చెప్పేశాను. దాంతో రమ్యకృష్ణ నవ్వుతూ .. 'థ్యాంక్యూ' చెప్పింది. 'నరసింహా'లో నీలాంబరి పాత్ర తరువాత ఆమెకి లభించిన అరుదైన పాత్ర ఇది. ఇద్దరు పిల్లలకి ఒకేసారి పాలిచ్చే సన్నివేశంలో రమ్యకృష్ణ నటనచూసి, నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఈ సినిమాకిగాను రమ్యకృష్ణకి నేషనల్ అవార్డు వస్తుందని భావించాను. రాకపోవడంతో రమ్యకృష్ణకన్నా ఎక్కువగా నేను డిజప్పాయింట్ అయ్యాను" అంటూ చెప్పుకొచ్చారు.   

  • Loading...

More Telugu News