తమిళనాడులో 'గజ' తుపాను బాధితులకు ఆది పినిశెట్టి సాయం!
- తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
- సహాయక సామగ్రి పంపిణీ
- ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపు
తమిళనాడులో గజ ప్రభావిత ప్రాంతాల్లో తన టీమ్ తో కలిసి ఆది పర్యటించాడు. ఈ సందర్భంగా 5 టన్నుల ఆహారం, మందులు, బెడ్ షీట్స్, దోమతెరలతో పాటు సోలార్, బ్యాటరీ లైట్లు అందజేశారు. అలాగే నాలుగు గ్రామాల్లోని 520 కుటుంబాలకు పునరావాసం కోసం అవసరమైన సామగ్రిని ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరూ తుపాను బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.