Andhra Pradesh: ఓసారి చార్జింగ్ పెడితే 455 కిలోమీటర్లు దూసుకెళ్లవచ్చు.. సరికొత్త ‘కియా’ కార్లను ఆవిష్కరించిన చంద్రబాబు!

- ఏపీ ప్రభుత్వానికి 3 ఎలక్ట్రిక్ కార్లు అందజేసిన కియా
- జనవరిలో మార్కెట్ లోకి తొలి వాణిజ్య కారు
- 10 శాతం వాహనాలను విదేశాలకు పంపే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ త్వరలోనే ఆటోమొబైల్ పరిశ్రమకు హబ్ గా మారబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. కియా మోటార్స్ రాకతో అనంతపురం జిల్లా రూపురేఖలు మారిపోతాయని వ్యాఖ్యానించారు. అమరావతిలోని సచివాలయం వద్ద ఈ రోజు కియా ఎలక్ట్రిక్ కార్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
అనంతరం వీటిలో కొద్దిదూరం ప్రయాణించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కియా కారు చాలా సౌకర్యవంతంగా ఉందని చెప్పారు. అనంతపురం ప్లాంటులో తొలికారు వచ్చే ఏడాది జనవరిలో బయటకు వస్తుందన్నారు. కియా కంపెనీ ఇక్కడ తయారుచేసే కార్లలో 90 శాతం దేశీయంగా అమ్ముతారనీ, మిగిలిన 10 శాతం కార్లను విదేశాలకు ఎగుమతి చేస్తారని వెల్లడించారు.