kcr: తెలంగాణ నిలిచి.. గెలవాలి: సీఎం కేసీఆర్

  • నాలుగేళ్లుగా ఏం జరుగుతోందో అందరికీ తెలుసు
  • ఆకుపచ్చ తెలంగాణ సాధించడమే నా లక్ష్యం
  •  దుఃఖం లేని తెలంగాణ కావాలి

నాలుగేళ్లుగా ఏం జరుగుతోందో అందరికీ తెలుసని, ఆకుపచ్చ తెలంగాణ సాధించడం. దుఃఖం లేని తెలంగాణ కావాలన్నదే తన లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. గజ్వేల్ లో నిర్వహిస్తున్న ప్రజాఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, తనది విచిత్రమైన పరిస్థితి అని, ఎన్నికల ప్రచారంలో ఇది చివరి సభ కనుక, ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందామనుకుంటే, రాష్ట్రం మొత్తానికి సందేశం ఇవ్వాలని చాలా మంది తనకు ఫోన్లు చేశారని అన్నారు.

నియోజకవర్గం గురించి చివరిలో మాట్లాడుకుందామని చెప్పిన ఆయన, అనేక పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఎంతో మంది త్యాగాల వల్లే రాష్ట్రం వచ్చిందని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం వేసిన విత్తనాలు పూతపూసి కాయ కాచే సమయం వస్తోందని, తెలంగాణ నిలిచి.. గెలవాలని.. నవ్వేటోళ్ల ముందు కాలు జారి పడొద్దని, దాచి దాచి దెయ్యాల పాలు చేయొద్దని, టీఆర్ఎస్ కే మళ్లీ పట్టం కట్టాలని కోరారు.

  • Loading...

More Telugu News