Chandrababu: కేసీఆర్ లో పెరుగుతున్న ఆగ్రహం... కారణమేంటో చెప్పిన చంద్రబాబు!

  • కేసీఆర్ కు ఓటమి భయం
  • ఆందోళనతోనే ఆగ్రహం వస్తోంది
  • కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న చంద్రబాబు

ఇటీవల కొన్ని సభల్లో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనానికి గురవుతూ, కార్యకర్తలు, నేతలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండటాన్ని చంద్రబాబునాయుడు తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. కేసీఆర్ లో ఓటమి భయం పట్టుకుందని, ఓడిపోతున్నామన్న ఆందోళనతోనే ఆయన అసహనంతో కోపాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు.

 నిన్న రాత్రి కుత్బుల్లాపూర్ లో జరిగిన రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావని అన్నారు. కూటమి నాయకుల సభలకు వస్తున్న ప్రజలను చూస్తుంటే, కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. తానేమీ కేసీఆర్ కోసం రాలేదని, తెలంగాణ ప్రజల కోసమే వచ్చానని చెప్పిన చంద్రబాబు, కేవలం తనను తిట్టేందుకు మాత్రమే కేసీఆర్ సభలను పెడుతున్నారని అన్నారు.

ఈ రెండు రోజులూ డబ్బు సంచులతో టీఆర్ఎస్ నాయకులు వస్తారని, తమను ఎవరూ కొనలేరని ఓటర్లు చెప్పాలని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి తాను ప్రణాళికలు వేస్తే, కాంగ్రెస్ పార్టీ వాటిని కొనసాగించి పూర్తి చేసిందని, కేసీఆర్ ఒక్క చిన్న పని కూడా చేయలేదని చంద్రబాబు నిప్పులు చెరిగారు. తన వద్ద పనిచేసిన వ్యక్తి, ఇప్పుడు తననే బెదిరిస్తున్నారని, ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల పాలనావకాశాన్ని ఆయన దుర్వినియోగం చేశారని అన్నారు.

  • Loading...

More Telugu News