రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశామంటే.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల అధికారి రజత్ కుమార్!
- కోస్గీ సభను అడ్డుకుంటామని రేవంత్ ప్రకటించారు
- టీఆర్ఎస్ పార్టీ దీనిపై ఫిర్యాదు చేసింది
- కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతోనే చర్యలు
ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించినట్లు పేర్కొన్నారు. కేంద్రస్థాయిలో వచ్చిన ఆదేశాలతోనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్వో, జిల్లా ఎన్నికల అధికారికి తాను ఉత్తర్వులు జారీచేశానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు ఆరోపించినట్లు తాము ఎవ్వరితోనూ కుమ్మక్కు కాలేదనీ, అలాంటి పని ఈసీ చేయదని తేల్చిచెప్పారు. తమకు అన్ని రాజకీయ పార్టీలు సమానమేనన్నారు. తెలంగాణలో డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రజత్ కుమార్ ప్రకటించారు.