తెలంగాణ ఎన్నికల కోసం టీడీపీ నేతలు ఒక్కో బస్సులో రూ.10 కోట్లు పంపుతున్నారు!: విజయసాయిరెడ్డి ఆరోపణ
- అనామకులతో వీటిని చేరవేస్తున్నారు
- అన్నింటిని సాక్ష్యాలతో బయటపెడతా
- రాహుల్ కు బాబు రూ.5 వేల కోట్లు ఇవ్వబోతున్నారు
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తన వాటాగా చంద్రబాబు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి రూ.5,000 కోట్లు అందించబోతున్నారని ఆరోపించారు. జాతీయ వాటా కింద ఈ అవినీతి సొమ్మును బాబు పంపుతున్నారని విమర్శించారు. అవినీతిలో చంద్రబాబు హిమాలయాల అంచులకు వెళ్లారని ఎద్దేవా చేశారు. ఈ విషయాలు బయటపెట్టినందుకు చంద్రబాబుతో పాటు ఆయన అనుచరులు తనపై క్రిమినల్ కేసులు పెట్టి వేధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయినా తాను భయపడబోనని స్పష్టం చేశారు.