TRS: మేమే 'ఏ-టీమ్' అని తెలుస్తుంది: కేటీఆర్

  • టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు బీ-టీమ్ అన్న మోదీ
  • బీజేపీకి బీ-టీమ్ అంటున్న కాంగ్రెస్
  • డిసెంబర్ 11న తెలుస్తుందన్న కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు బీ-టీమ్ అని నరేంద్ర మోదీ, బీజేపీకి బీ-టీమ్ అని కాంగ్రెస్ విమర్శిస్తుండటంపై తెలంగాణ రాష్ట్ర సమితి యువనేత కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెడుతూ, తమదే 'ఏ-టీమ్' అని 11వ తేదీన ప్రతి ఒక్కరికీ తెలుస్తుందన్నారు.

 "తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ, తెరాసను కాంగ్రెస్ బీ-టీమ్ అని అభివర్ణించారు. ఇక రాహుల్ గాంధీ, బీజేపీకి టీఆర్ఎస్ బీ-టీమ్ అంటున్నారు. ఈ ఇద్దరు పెద్దమనుషులకూ డిసెంబర్ 11న మేము తెలంగాణ ప్రజల ఏ-టీమ్ అన్న సంగతి తెలుస్తుంది" అని వ్యాఖ్యానించారు.



  • Loading...

More Telugu News