rajani: '2.ఓ' తొలిరోజు వసూళ్లు 100 కోట్లకి పైనే!

  • నిన్ననే థియేటర్లకు వచ్చిన '2.ఓ'
  • అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ 
  • కొత్త రికార్డులు నమోదు చేసే ఛాన్స్

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన '2.ఓ' సినిమా నిన్ననే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రజనీ .. అక్షయ్ .. ఎమీ జాక్సన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 10,500 థియేటర్స్ లో విడుదలై కొత్త రికార్డును సాధించింది.

తొలి రోజున ఒక్క హిందీ వెర్షన్ లోనే ఈ సినిమా 25 కోట్ల వరకూ సాధించి ఉండొచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున తెలుగు .. తమిళ వెర్షన్ల వసూళ్లు కలుపుకుంటే ఈ సినిమా 100 కోట్లకి పైగానే రాబట్టి ఉండొచ్చని చెబుతున్నారు. లాంగ్ వీకెండ్ కారణంగా ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. వీకెండ్ పూర్తయ్యే నాటికి వసూళ్ల విషయంలో ఈ సినిమా కొత్త రికార్డులను నమోదు చేయవచ్చనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News