anjaneya swamy: ‘ఆంజనేయ స్వామి ఓ దళితుడు’ అన్న యూపీ ముఖ్యమంత్రి.. లీగల్ నోటీసు పంపిన హిందూ సంస్థ!

  • ఉత్తరప్రదేశ్ సీఎం యోగి వివాదాస్పద వ్యాఖ్యలు
  • హనుమంతుడు అడవిలో జీవించాడని వెల్లడి
  • 3 రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసులు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదంలో చిక్కుకున్నారు. హనుమంతుడు నిరుపేద దళితుడని యోగి వ్యాఖ్యానించడంతో పలువురు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యోగికి సర్వ్ బ్రాహ్మిణ్ మహాసభ సంస్థ లీగల్ నోటీసులు జారీచేసింది. కోట్లాది మంది భక్తులు పూజించే ఆంజనేయ స్వామికి ఓ కులం ఆపాదించడంపై మండిపడింది. ఈ ఘటనకు రాజస్తాన్ లోని ఆళ్వార్ జిల్లా వేదికయింది.

ఆళ్వార్ లోని మాలాఖేడాలో యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘హనుమంతుడు అడవిలో జీవించేవాడు. ఆయన నిరుపేద దళితుడు. రాముని ఆకాంక్ష మేరకు ఆయన భారత సమాజాన్ని ఏకం చేయటానికి కృషి చేశాడు. ఆయన మాదిరిగానే మనం కూడా రాముని ఆకాంక్షను నెరవేర్చేదాకా విశ్రమించకూడదు.

ఈ నేపథ్యంలో ప్రజలంతా రావణులకు కాకుండా రామభక్తులకే ఓటేయ్యాలి’ అని పిలుపునిచ్చారు. అయితే ఆంజనేయస్వామికి ఓ కులాన్ని ఆపాదించడంపై సర్వ్ బ్రాహ్మిణ్ మహాసభ చీఫ్ సురేశ్ మిశ్రా ఆయనకు లీగల్ నోటీసులు జారీచేశారు. మూడు రోజుల్లోగా భక్తులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

anjaneya swamy
dalit
hindu potfit
legal notice
Uttar Pradesh
yogi
sarv brahmon mahasabha
3 days
say sorry
  • Loading...

More Telugu News