rashmika: విజయ్ సినిమాలో చేయడంలేదు: రష్మిక మందన

  • విజయ్ .. అట్లీ కాంబినేషన్లో సినిమా 
  • ఒక కథానాయికగా నయనతార 
  • ట్విట్టర్ ద్వారా స్పందించిన రష్మిక  

దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సర్కార్' సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత అట్లీ కుమార్ దర్శకత్వంలో విజయ్ ఒక సినిమా చేయనున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'మెర్సల్' ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ కాంబినేషన్ మరో మారు సెట్స్ పైకి వెళ్లడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో ఒక కథానాయికగా నయనతారను ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. మరో కథానాయికగా రష్మిక మందనను తీసుకున్నారనేది కోలీవుడ్ టాక్. తాజాగా ఈ విషయంపై రష్మిక మందన ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఈ ప్రాజెక్టు నుంచి తనని ఎవరూ సంప్రదించలేదనీ .. అందువలన తాను ఈ సినిమా చేయడంలేదని, అయితే, త్వరలోనే విజయ్ తో కలిసి మరో సినిమా చేసే అవకాశం వుందని అంది. ఇక రాజమౌళి మల్టీస్టారర్ మూవీకి సంబంధించిన కథానాయికల జాబితాలోను రష్మిక మందన పేరు ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.   

  • Loading...

More Telugu News