Chandrababu: తెలుగు జాతి మంచి కోసం శత్రువుతో కూడా చేతులు కలిపాను.. కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారో అందరికీ తెలుసు: చంద్రబాబు

  • కేసీఆర్ కు రాజకీయ జీవితం ఇచ్చింది టీడీపీనే 
  • నా అనుచరుడిగా ఉన్న వ్యక్తి నన్ను తిడితే బాధ అనిపించదా?
  • దేశాన్ని మోదీ భ్రష్టు పట్టించారు

కేంద్ర, రాష్ట్ర సంబంధాలను ప్రధాని మోదీ పూర్తిగా దెబ్బతీశారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. దేశాన్ని కాపాడుకోవడం కోసం పార్టీలను ఏకం చేస్తున్నామని చెప్పారు. తెలుగు జాతి మేలు కోసం శత్రువుతో కూడా చేతులు కలిపానని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీని బీజేపీ నమ్మించి, మోసం చేసిందని చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తే... చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నవారిపై కేంద్ర ప్రభుత్వం ఐటీ, ఈడీ దాడులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద నోట్లను రద్దు చేసి దేశాన్ని మోదీ భ్రష్టు పట్టించారని విమర్శించారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడుతూ, చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని... నిన్న కూడా తనను తిట్టారని చంద్రబాబు మండిపడ్డారు. కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారో అందరికీ తెలుసని... ఆయనకు రాజకీయ జీవితం ఇచ్చింది టీడీపీనే అని చెప్పారు. తన అనుచరుడిగా ఉన్న వ్యక్తి తనను తిడితే బాధ అనిపించదా? అని అన్నారు. దీన్ని కేసీఆర్ విచక్షణకే వదిలేస్తున్నానని అన్నారు. హైదరాబాదులో మైక్రోసాఫ్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టులతో పాటు పలు సంస్థలు ఏర్పాటు కావడానికి తానే కారణమని చెప్పారు. 

  • Loading...

More Telugu News