rajani: తెలుగు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా థియేటర్లలో '2.ఓ'

  • 600 కోట్ల బడ్జెట్ తో 2.ఓ' 
  • 6,800 థియేటర్స్ లో రిలీజ్ 
  • ఒక్క నైజామ్ లోనే 400 థియేటర్లు          

శంకర్ దర్శకత్వం వహించిన '2.ఓ' ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందడంతో, అందరి దృష్టి ఈ సినిమాపైనే వుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 6,800 థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. తమిళనాడులో కంటే ఎక్కువ థియేటర్స్ లో ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తుండటం విశేషం. తమిళనాడులో 600 నుంచి 700 థియేటర్లలోపే ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ సంఖ్య ఎక్కువగా ఉండటంతో, ఇక్కడ 1000 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. నైజామ్ ఏరియాలోనే ఈ సినిమాకి 400 థియేటర్లు దక్కడం విశేషం. ఒక్క హైదరాబాద్ లోనే ఈ సినిమా కోసం 100కి పైగా థియేటర్లు కేటాయించారట. ఇలా రికార్డు స్థాయిలో విడుదలవుతోన్న ఈ సినిమా, వసూళ్ల విషయంలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకెళ్లడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. 

  • Loading...

More Telugu News