rajani: ఆశ్చర్యపరుస్తోన్న '2.ఓ' ప్రీ రిలీజ్ బిజినెస్

  • భారీ బడ్జెట్ తో నిర్మితమైన సినిమా 
  • అత్యధిక థియేటర్లలో విడుదల 
  • సరికొత్త రికార్డులు నమోదు చేసే ఛాన్స్  

రజనీకాంత్ కథానాయకుడిగా .. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నిర్మితమైన '2.ఓ' ఈ నెల 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా వున్న రజనీ అభిమానులు ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి గల క్రేజ్ కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగినట్టుగా సమాచారం.

రజనీకాంత్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మితమైన తొలి సినిమా ఇదే కాగా, ఆ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమా కూడా ఇదేనని అంటున్నారు. వివిధ హక్కుల రూపంలో ఇప్పటికే ఈ సినిమా 370 కోట్లు రాబట్టినట్టుగా చెబుతున్నారు. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఒకేసారి విడుదలవుతోన్న ఈ సినిమా, ఓపెనింగ్స్ పరంగా కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో రజనీ సరసన కథానాయికగా ఎమీ జాక్సన్ నటించిన సంగతి తెలిసిందే.    

  • Loading...

More Telugu News