ఖైరతాబాద్ సీటును తీసుకున్న కాంగ్రెస్.. మనస్తాపంతో ఎన్టీఆర్ భవన్ ముందు విద్యుత్ టవర్ ఎక్కిన టీడీపీ కార్యకర్త!
- ఎన్టీఆర్ భవన్ వద్ద దీపక్ రెడ్డి అనుచరుల ఆందోళన
- టవర్ ఎక్కిన మజ్జు అనే టీడీపీ కార్యకర్త
- దీపక్ రెడ్డికి హామీ ఇస్తేనే దిగివస్తానని స్పష్టీకరణ
వీరిలో మజ్జు అనే కార్యకర్త ఎన్టీఆర్ భవన్ ఎదురుగా ఉన్న విద్యుత్ పైలాన్ ను ఎక్కాడు. తమ నాయకుడికి కూటమి తరఫున టికెట్ కేటాయిస్తేనే కిందకు దిగివస్తానని ప్రకటించాడు. లేదంటే ప్రాణ త్యాగం చేసుకునేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశాడు. ఎవరైనా పైకి వస్తే ఇప్పుడే దూకేస్తానని హెచ్చరించాడు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మజ్జుతో పాటు టీడీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ భవన్ వద్ద టెన్షన్ టెన్షన్ పరిస్థితి నెలకొంది. కాగా, కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ టికెట్ ను విష్ణువర్దన్ రెడ్డికి, ఖైరతాబాద్ టికెట్ ను దాసోజు శ్రవణ్ కు కేటాయించిన సంగతి తెలిసిందే.